![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -382 లో.. అమూల్య కన్పించడం లేదని విశ్వ వాళ్ళ పని ఇదంతా అని ముగ్గురు అన్నాతమ్ముళ్లు భద్రవతి ఇంటిపైకి గొడవకి వెళ్తారు. మీ చెల్లి లేచిపోతే ఇక్కడికి వచ్చి అడుగుతారేంట్రా అని భద్రవతి తప్పుగా మాట్లాడుతుంటే ధీరజ్ కి పట్టరాని కోపం వస్తుంది. అప్పుడే భద్రవతి వాళ్ళ పెద్దమ్మ వచ్చి.. అసలు ఏం జరుగుతుందని అడుగుతుంది. అమూల్య కన్పించడం లేదు.. వీళ్లే ఏదో చేశారని ధీరజ్ అంటాడు.
విశ్వ ఇంట్లో లేడు.. మీరు ముందు వెళ్లి అమూల్యని వెతకండి అని పెద్దావిడ అంటుంది. నా చెల్లికి ఏదైనా అవ్వాలి.. ఒక్కొక్కడి సంగతి చెప్తానని ధీరజ్ అందరికి వార్నింగ్ ఇస్తాడు. అమూల్య లేదని నర్మద వాళ్ళు టెన్షన్ పడుతారు. రాత్రి కరెంటు తీసేసారు. అప్పుడే ఇదంతా జరిగి ఉంటుందని ప్రేమ అంటుంది. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదని నర్మద అడుగుతుంది. ధీరజ్ కీ చెప్పాను కానీ వాడు పట్టించుకోలేదని ప్రేమ అంటుంది. మరొకవైపు అమూల్య దగ్గరికి విశ్వ మల్లెపూలు తీసుకొని వెళ్లి.. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్ అని చెప్పగానే అమూల్య షాక్ అవుతుంది. ఇప్పుడు అందరు నువ్వు లేచిపోయావ్ అనుకుంటారు. మీ నాన్న పరువుపోతుందని విశ్వ అంటాడు. అమూల్య ఏడుస్తుంది. ఆ తర్వాత రామరాజు, భద్రవతి పెళ్లి బట్టలు తీసుకొని వస్తారు. అమూల్య లేదని తెలియగానే వేదవతి కుప్పకూలుతుంది. ఇలా చేస్తుంది అనుకోలేదని వేదవతి ఏడుస్తుంది. అప్పుడే వనజ ఫ్యామిలీ వస్తుంది.
అమ్మాయి రెడీ అయిందా అని అడుగుతుంది. అమ్మ మీరు లోపలికి రండి అని రామరాజు అంటాడు. లోపలికి పిలిచి నా కూతురు లేచిపోయిందని చెప్తారా.. మీ ఫ్యామిలీకి లేచిపోవడం వెన్నతో పెట్టిన విద్య రా అని పైనుండి చూస్తూ భద్రవతి అంటుంది. తరువాయి భాగంలో అమూల్యని తీసుకొని విశ్వ ఎంట్రీ ఇస్తాడు. అమూల్య రాత్రంతా నాతోనే ఉందని విశ్వ అంటాడు. విశ్వని కొట్టబోతుంటే.. ఆగండి మేమ్ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అమూల్య అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |